మళియాళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు సురేష్ గోపీ అందరికీ సుపరిచితమే. కేవలం మాలీవుడ్ లోనే కాదు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించారు సురేష్ గోపి. ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన గత కొంత కాలంగా విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా సురేష్ గోపి సోదరుడు సునీల్ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోయంబత్తూరులోని ఓ భూకుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని విక్రయించడంతో సునీల్ గోపీని కోయంబత్తూరు క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోయంబత్తూరుకు చెందిన జీఎన్ మిల్స్ లో ఉంటున్న గిరిధరన్ కు కోర్టు తీర్పును థిక్కరించి 4.52 ఎకరాల భూమిని విక్రయించారు. సునీల్ గోపి ఈ స్థలాన్ని నవకరై కు చెందిన మయిల్ సామి వద్ద నుంచి కొనుగోలు చేశాడు. దీనిపై బాండ్ రిజిస్ట్రేషన్ చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. అయినా స్థలాన్ని గిరిధరన్ కు సునీల్ గోపి విక్రయించాడు.
ఇది చదవండి: ప్రజలను భయపెడుతున్న ధరలు! కిలో చికెన్ రూ.1000 !
ఇందుకుగాను గిరిధరన్ వివిధ బ్యాంకు ఖాతాల నుంచి అడ్వాన్స్గా రూ.97 లక్షలు చెల్లించాడు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. అది వేరొకరి పేరు మీద ఉందని తేలింది. దీనిపై గిరిధరన్.. సునీల్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ అతని నుంచి సరైన స్పందన రాకపోవడం వల్ల గిరిధరన్ కోయంబత్తూరు జిల్లా క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశారు.