తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నటుడు సుమన్. ఆగష్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత షూటింగ్స్ తిరిగి ప్రారంభించేది ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయంపై నటుడు సుమన్ స్పందిస్తూ.. సినిమా షూటింగ్స్ బంద్ అనే నిర్ణయం సరికాదని అన్నారు.
బంద్తో ఓటీటీలకు ఎలాంటి నష్టం లేదని, కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. ఓటీటీ సినిమాల సెన్సార్పై దృష్టి సారిస్తే బాగుంటుందని అన్నారు సుమన్. అలాగే హీరోల రెమ్యూనరేషన్స్ పై చర్చలు అనవసరమని.. అందరు హీరోల రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలనడం సబబు కాదని, ఇండస్ట్రీలో మా ఫ్యామిలీస్ అని చెప్పుకు తిరిగే వాళ్ల హీరోలను తగ్గించుకోమని అడగాలని సుమన్ చురకలు వేశారు.
ఇక హీరోలకు ఉన్న ఆదరణ బట్టి రెమ్యూనరేషన్ ఇస్తుంటారని.. షూటింగ్ల సమయాన్ని ప్రొడ్యూసర్లు పెంచుకోవాలని, అవసరం మేరకే కాల్షీట్లు తీసుకోవాలని సూచించారు. చివరిగా బయ్యర్లకు నష్టం లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. కోలీవుడ్ లో సినిమాలకు నష్టాలు వస్తే రజనీకాంత్ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేస్తారని, అటువంటి ఉదారత ఇక్కడ కూడా ఉంటే మంచిదని హితవు పలికారు సుమన్. మరి సుమన్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.