సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటులు శివాజీ గణేశన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కోలీవుడ్ లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. ఆయన కుమారుడు, మనువడు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నటుడు శివాజీ గణేషన్ ఇంట్లో ప్రస్తుతం ఆస్తికి సంబంధించిన కొడవలు మొదలైనట్లు తెలుస్తుంది. తమ తండ్రి ఆస్తిలో భాగం కోసం ఆయన కుమార్తెలు కోర్టుకెక్కారు.
తమిళ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ నటుల్లో ఒకరైన శివాజీ గణేశన్ కి ఇద్దరు కుమారులు ప్రభు, రామ్ కుమార్ లు.. ఇద్దరు కుమార్తెలు శాంతి, రాజ్వి. నటుడిగా శివాజీ గణేశన్ కి ఎంతో గొప్ప పేరు ఉంది. ఆయన మరణం తర్వాత రూ.270 కోట్లకు సంబంధించిన ఆస్తి విషయంలో ఇప్పుడు గొడవలు మొదలైనట్లు తెలుస్తుంది. ఈ విషయంలో తమ సోదరులు తమను దారుణంగా మోసం చేశారని శాంతి, రాజ్వీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో తమకు సమాచారం ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని.. ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని కోరారు.
తమ తండ్రి సంపాదించిన ఆస్తి లో బంగారు నగలు, వెండి వస్తువుల విషయంలో కూడా తమను మోసం చేశారని.. అలాగే శాంతి సినిమా థియేటర్ కి సంబంధించిన రూ.82 కోట్ల ఆస్తి తన సోదరులు తమ పేర్ల మీదకు మార్చుకున్నారని ఆరోపించారు. అంతేకాదు తమ తండ్రి రాసిన వీలూనామా లేఖ నకిలీదని పేర్కొన్నారు. మొదటి నుంచి తమ తండ్రి ఆస్తి విషయంలో తమను మోసం చేస్తూ వస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టుని కోరారు. ఈ కేసులో ప్రభు, రామ్ కుమార్ లతో పాటు వారి తనయుల పేర్లు కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.