Babloo Prudhvi Raj: చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా కెరీర్ను ప్రారంభించారు నటుడు పృధ్వీరాజ్. తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని బబ్లూ పృధ్వీరాజ్ అయ్యారు. 1970లలో వచ్చిన పలు తెలుగు, తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. ‘‘అమ్మ మనసు’’ ఆయన మొదటి తెలుగు సినిమా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్రైట్ సినిమా చేశారు. ఆ సినిమా పేరు ‘పెళ్లి’. ఈ సినిమాలో నెగిటివ్ సేడ్స్ ఉన్న రోల్లో నటించి బెస్ట్ విలన్గా నంది అవార్డు గెలుచుకున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 1994లో పృధ్వీ.. బీనాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు అహద్. పృధ్వీ దంపతులకు అహద్ ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డ విషయంలో తీవ్ర విషాదాన్ని అనుభవిస్తున్నారు పృధ్వీ. అహద్ చిన్నప్పటినుంచి ఆటిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుమారుడి పరిస్థితిపై పృధ్వీరాజ్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ అహద్ ఆటిజంతో బాధపడుతున్నాడు. అతడు ఎవరితోనూ కలవాలని అనుకోడు. అతడి ప్రపంచంలో అతడు సంతోషంగా ఉంటాడు.
ఇవి కేవలం చిన్న లక్షణాలు మాత్రమే. ఆటిజంలో ఇంకా పెద్ద లక్షణాలు ఉన్నాయి. ఆటిజం వచ్చిన వారు నేర్చుకోవటంలో వెనకబడి ఉంటారు. మనమే వారికి అన్నీ నేర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతడికి 27 ఏళ్లు. చాలా చక్కగా ఉన్నాడు. అన్నీ బాగా అర్థం చేసుకుంటున్నాడు. అతడికి మాట రాదు. కానీ, అన్నీ బాగా అర్థం చేసుకుంటాడు. నాకు ఒక్కడే కొడుకు. రెండో బిడ్డకు కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక వేళ బాబు మామూలుగా పుట్టినా ఆహద్ను పట్టించుకోమన్న ఉద్ధేశ్యంతో రెండో బిడ్డను కనలేదు.
చిన్నప్పుడు తెలియలేదు. 3 ఏళ్ల అప్పుడు తెలిసింది అతడికి ఆటిజం ఉందని. ఇప్పుడు తన పనులు తాను చేసుకుంటాడు. బాబు విషయంలో నా భార్య చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అహద్కు రూల్స్ పెడుతుంటుంది. కానీ, నేను ఆ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను. అందుకే నేనుంటే చాలా సంతోషంగా ఉంటాడు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నా. అన్ని చోట్లా నా కుమారుడి గురించి మాట్లాడుతున్నాను. అతడు నా వీక్నెస్ కాదు స్ట్రెన్త్. బాబు విషయంలో వెంకటేష్ నాకు మంచి మాటలు చెప్పారు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Rashmika: అందాల షోలో మరింత ఓపెనప్ అయిపోయిన రష్మిక.. ఫోటోలు వైరల్!