హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (టీఎస్ఎస్పీడీసీఎల్).. డైరెక్ట్ ప్రాతిపదికన 1601 జూనియర్ లైన్మ్యాన్, అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పత్రిక ప్రకటనను మాత్రమే వెల్లడించారు. ఫిబ్రవరి 15 లేదా ఆలోపు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో అందబాటులో ఉంచనున్నట్లు సంస్థ తెలిపింది.
మొత్తం ఖాళీల సంఖ్య: 1,601
జూనియర్ లైన్మ్యాన్ ఉద్యోగాలకు పదోతరగతితో పాటు ఐటీఐ(ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు(ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత కలిగివుండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
జూనియర్ లైన్మెన్ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు కాగా, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
జూనియర్ లైన్మ్యాన్ ఉద్యోగాలకు నెలకు రూ.24,340- రూ.39405 వరకు, అసిస్టెంట్ ఇంజినీర్ గా ఎంపికైన వారు నెలకు రూ.64,295- రూ.99,345 వరకు వేతనాన్ని అందుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఎంపిక విధానం:
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్మ్యాన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
కాగా, గతేడాది టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్వహించిన జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దయ్యింది. మొత్తం 1000 పోస్టులకు జులై 17న రాత పరీక్ష నిర్వహించగా, కొందరు అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు రాచకొండ కమిషనరేట్ పోలీసుల విచారణలో తేలింది. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్.. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది.