7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ చేసిన వారికి గుడ్ న్యూస్. ఈ నెల 25న మెగా జాబ్ మేళా జరగబోతోంది. 72 కంపెనీల్లో 10 వేల ఉద్యోగావకాశాలు ఉన్నాయి. నెలకు 15 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జీతం పొందే అవకాశం. త్వరగా రిజిస్టర్ చేసుకోండి.
మీరు 7వ తరగతి పాసయ్యారా? పదవ తరగతి పాసయ్యారా? అయితే 72 కంపెనీల్లో ఏదో ఒక కంపెనీలో మీరు ఉద్యోగం పొందవచ్చు. 10 వేల ఉద్యోగాల్లో మీకు తగిన ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. విద్యావేత్తలు, రాజకీయ నాయుకులు, స్వచ్చంద సంస్థల ఆధ్య్వర్యంలో జాబ్ మేళాలను నిర్వహిసుత్న్నారు. దీంతో నిరుద్యోగులకు వేలాదిగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 72 కంపెనీల్లో 9 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ మేళాలో పాల్గొనండి.
తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటిసారిగా మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నేత, కోదాడ నియోజకవర్గ మాజీ ఇంఛార్జి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో మొత్తం 72 కంపెనీలు పాల్గొంటుండగా.. దాదాపు 10 వేల ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లోమా, బీ.ఫార్మా/ఎం. ఫార్మా, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసిఎస్ తదితర చదువులు చదువుకున్న నిరుద్యోగులకు ఈ ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.
ఐటీ, మెడికల్, ఈకామర్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, హోటల్స్, పరిశ్రమలు, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా సహా అనేక ఇతర రంగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. కోదాడలోని పెరిక్ భవన్ లో శనివారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ జాబ్ మేళాలో పాల్గొనాలంటే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్ళు ఉండాలి. 35 ఏళ్ళు పైబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మూగ, చెవిటి, దివ్యాంగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు 15 వేల నుంచి లక్ష వరకూ జీతం ఉంటుంది.