ప్రతిభ ఉన్న వారి అవసరం దేశానికి చాలా ఉంది. ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన కారణంగా చదువు అర్ధాంతరంగా ఆగిపోకూడదనే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా పేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్పులను అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బడ్తే కదం స్కాలర్ షిప్ 2022-23 ప్రోగ్రాం పేరుతో.. ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తున్నవారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి హెచ్డీఎఫ్సీ బ్యాంకు లక్ష వరకూ స్కాలర్ షిప్ ను అందిస్తుంది. దివ్యాంగులైన విద్యార్థులు కూడా ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. బడ్తే కదం అంటేనే ముందుకు సాగుతున్న అడుగులు అని అర్థం.
అంటే తాము అందించే స్కాలర్ షిప్ తో చదువుకి ఎలాంటి ఆటంకం కలగనివ్వకుండా.. విద్యార్థుల అడుగులు ముందుకు సాగాలి అనే లక్ష్యంతో ఈ స్కాలర్ షిప్ ని అందిస్తున్నారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన బాగా చదివే విద్యార్థులు తమ చదువును ఎటువంటి అంతరాయం లేకుండా చదువు పూర్తి చేసేందుకు ఆర్ధిక సహాయం చేయడమే లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ బడ్తే కదం స్కాలర్ షిప్ అందిస్తుంది. అంతేకాదు ఈ స్కాలర్ షిప్ కి ఎంపికైన విద్యార్థులకు అదనంగా ఆర్ధిక సహాయం అందించనున్నారు. మెంటర్ షిప్,కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ని పొందేలా ప్రోత్సాహం అందించనున్నారు. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, లెర్నింగ్ డివైజ్ లు, పుస్తకాలు, స్టేషనరీ ఐటమ్స్ వంటి అకాడమిక్ ఖర్చులకి ఈ స్కాలర్ షిప్ ఉపయోగపడుతుంది. మరి ఎవరెవరికి ఈ స్కాలర్ షిప్ ఇస్తున్నారు? ఎంత స్కాలర్ షిప్ ఇస్తున్నారు? స్కాలర్ షిప్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
గమనిక: స్కాలర్ షిప్ లకు సంబంధించి ఫండ్స్ కేవలం ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ, ఆన్ లైన్ లెర్నింగ్, ఇంటర్నెట్ డేటా రీఛార్జ్ ల కోసమే వినియోగించాలి.