విద్యార్ధులు అంటే విద్యను అర్జించే వారు. అయితే కొందరు మాత్రం చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. పరీక్షలు ఎన్ని సార్లు రాసిన ఉత్తీర్ణత కావడం అనేది గగనంగా మారుతుంది. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
విద్యార్ధులు అంటే విద్యను అర్జించే వారు. అయితే కొందరు మాత్రం చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. పరీక్షలు ఎన్ని సార్లు రాసిన ఉత్తీర్ణత కావడం అనేది గగనంగా మారుతుంది. అలా ఏళ్ల తరబడి రాసి చివరకు విసుగు చెంది.. పరీక్షలు రాయడం మానేస్తారు. ఈ కోవకు చెందిన వారు విద్యకు సంబంధించిన అన్ని కోర్సులలో పలువురు ఉంటారు. అలానే పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ఇంత వరకు పాస్ కాలేకోపోయిన కొందరు ఉంటారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిలైన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతించింది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో 1990 నుంచి ఇంతవరకు పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. అలాంటి వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జూన్లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సీ శ్రీనాథ్ మార్చి 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అభ్యర్థులకు ఈ ఏడాది పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను విడుదల చేశారు. అభ్యర్ధులు రూ.3 వేల పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈపరీక్ష ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 10 చివరి తేదీగా నిర్ణయించారు. అలానే రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు చెల్లించవచ్చు.
తత్కాల్ స్కీం కింద ఎగ్జామ్ ఫీజుతో పాటు మరో రూ.6,000 అదనంగా కలిపి ఏప్రిల్ 15 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఒక విద్యార్థి 12 సబ్జెక్టులు ఫెయిలైతే.. సంబంధిత అభ్యర్థి 3 సబ్జెక్టుల నుంచి మినహాయింపు పొంది 9 పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. ఇలా ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే వాటి నుంచి 3 సబ్జెక్టుల నుంచి మినహాయింపునిస్తారు. ఎవరైనా ఒకరు 4 సబ్జెక్టులు ఫెయిలై ఉంటే ఇప్పుడు మూడింటి నుంచి మినహాయింపు పొంది ఒక పరీక్ష రాసి పాస్ అయితే సరిపోతుంది. 1990 నుంచి ఉత్తీర్ణత కానీ వారి సంఖ్య 1000కి పైగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.