ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నిన్న( ఆదివారం) జరగాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఈ రోజుకి వాయిదా వేసిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్
ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో ఇరు జట్ల అభిమానులు తమ జట్టు టైటిల్ సాధించాలని కోరుకుంటున్నారు. నిన్న( ఆదివారం) జరగాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఈ రోజుకి వాయిదా వేసిన సంగతి తెలిసందే. ఈ రోజుని రిజర్వ్ డే గా ప్రకటించగానే క్రికెట్ ఫ్యాన్స్ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ చూడవచ్చు అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే వాతావరణ పరిస్థితి చూసుకుంటే ఈ రోజు కూడా వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అని రిపోర్ట్స్ చెప్పాయి. దీంతో గుజరాత్ ఫ్యాన్స్ ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు.
రూల్స్ ప్రకారం ఈ రోజు కూడా వర్షం పడి అర్దరాత్రి 12 గంటలవరకు మ్యాచ్ జరగకపోతే గ్రూప్ దశలో ఎవరికైతే ఎక్కువ పాయింట్లు ఉంటాయో ఆ జట్టునే విజేతగా ప్రకటిస్తారు. దీని ప్రకారం వర్షం పది మ్యాచ్ రద్దయితే గుజరాత్ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంటుంది. ఇప్పుడిదే చెన్నై ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం అహ్మదాబాద్ లో తీవ్ర ఎండ కాస్తుంది. దీంతో మ్యాచ్ జరగడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే చెన్నై ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. మరి వాతావరణం సాయంత్రం వరకు ఇలాగే అనుకూలిస్తుందా? లేకపోతే మ్యాచ్ జరిగే సమయంలో మరోసారి అంతరాయం కలిగిస్తుందా చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.