సభ్య సమాజం తలదించుకునే.. ఆశ్చర్య పరిచే వింతైన సంఘటన ఒకటి దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓ అక్క తన సొంత చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్ర, పుణెకు చెందిన 24 ఏళ్ల అక్క, 18 చెల్లెలు తమ తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం చెల్లెలు ఇంట్లోని హాలులో నిద్రపోతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్క అక్కడికి వచ్చింది. చెల్లెలితో తప్పుగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. దీంతో చెల్లెలికి నిద్రా భంగం అయింది. లేచి చూస్తే.. అక్క తనతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంది. అక్క ప్రవర్తనతో చెల్లెలు ఒక్కసారిగా షాక్ తింది. దిగ్గున పైకి లేచింది. అక్కతో వాగ్వివాదానికి దిగింది. కొద్ది సేపటికి వాగ్వివాదం కాస్తా గొడవగా మారింది.
అక్క మాటలతో చెల్లెలికి మరింత కోపం వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుంది. అదే రోజున పుణె ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అక్క ప్రవర్తనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం సెంసిటివ్ది కావటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పోలీసుల విచారణలో సదరు అక్క గురించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు ఇది వరకే పెళ్లయిందని, భర్తతో విడిపోయి పుట్టింటికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమె కారణంగా ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన విషయాలను చెప్పటానికి ఇంటి సభ్యులు సుముఖత వ్యక్తం చేయటం లేదన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.