ప్రేమను పంచే తల్లిదండ్రులు.. గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త.. ఆదరంగా అభిమానించే అత్తామామలు.. ఇంతకంటే ఏం కావాలి.. ఈ సంతోషాలను రెట్టింపు చేస్తూ.. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. రాబోయే చిన్నారి కోసం అటు పుట్టింటి వాళ్లు.. ఇటు మెట్టింటి వాళ్లు.. సంతోషంగా ఎదురు చూస్తున్నారు. పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ.. సంతోషంగా గడపాల్సిన ఆ తల్లి.. కడుపులోని చిన్నారి గురించి కూడా పట్టించుకోకుండా.. తనను ప్రేమించే వాళ్లను.. తను ప్రాణపదంగా భావిస్తున్న బిడ్డను వదిలి పోయింది. కారణం.. కొందరు మృగాళ్లు. పెళ్లైంది.. గర్భవతి అని కూడా చూడకుండా.. వేధింపులకు గురి చేశారు. ఆ నరకం భరించలేక.. దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం.. బండమీదతండాలో చోటు చేసుకుంది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన మనుబోతులగడ్డకు చెందిన భూక్య డోలి, బిచినిల చిన్న కుమార్తె అనూషను బండమీదతండాకు చెందిన రమేశ్కి ఇచ్చి 2022, ఫిబ్రవరి మాసంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం అనూష మూడు నెలల గర్భవతి. ఎంతో సంతోషంగా సాగతున్న ఆమె జీవితంలో.. కొందరు వ్యక్తులు విషం చిమ్మారు.
గ్రామానికి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి.. మరికొంతమందితో కలిసి.. గత కొంతకాలంగా.. అనూషను వేధింపులకు గురి చేస్తున్నారు. దీని గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు గ్రామ పెద్దలు, పోలీసులు హెచ్చరించినా సరే ఉస్మాన్ వేధింపులకు పాల్పడటం ఆపడం లేదు. దాంతో విసుగు చెందిన అనూష.. కన్నవాళ్లు, కట్టుకున్న వాడు.. ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా.. దారుణ నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే అనూషను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అనూష చికిత్స పొందుతూ.. రెండు రోజుల క్రితం మృతి చెందింది.
దాంతో తమ కుమార్తె మృతికి కారణమైన ఉస్మాన్, అతని మిత్రులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమించారు. మరి అనూష తీసుకున్న నిర్ణయం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.