పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు వైష్ణవి. ఇంటర్ సెకండియర్ చదువుతుండేది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి చదువుకుంటానని రాత్రి రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు వైష్ణవి. చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా ఉండే ఈ అమ్మాయి.. అందరితో సరదాగా ఉండేది. ఇక తల్లిదండ్రులు కూడా వైష్ణవిని గారాబంగా పెంచుకున్నారు. దీంతో తమ కూతురు జీవితంలో గొప్పగా స్థిరపడాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి బాగా చదివించారు. ఇక కూతురు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగానే కష్టపడి చదివింది. కట్ చేస్తే.. ఉన్నట్టుండి ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ వనపర్తి జిల్లాలోని రామకృష్ణాపూర్ ప్రాంతం. ఇక్కడే వైష్ణవి (17) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. కూతురుని బాగా చదివించి గొప్ప ప్రయోజకురాలిగా చేయాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఇందులో భాగంగానే ఆ బాలికను మంచి కాలేజీలో చదివించారు. వైష్ణవి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతుండేది. ఈ క్రమంలోనే చదువుకుంటూనే ఆ బాలిక నీట్ కు ప్రిపేర్ అయ్యింది.
అయితే.. నేను నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతానా లేదా అనే అనుమనం ఆ బాలికను తరుచూ వేధిస్తుండేది. . గత కొంత కాలం నుంచి ఆ బాలిక ఇదే విషయం గురించి బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఈ క్రమంలోనే వైష్ణవి గురువారం రాత్రి చదువుకుంటానని తన రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనంతరం ఈ యువతి రూమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక చాలా సేపటి తర్వాత తల్లిదండ్రులు కూతురి రూమ్ లో చూడగా.. ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ బాలిక మరణించిందని వైద్యులు నిర్ధారించారు. కూతురి మరణ వార్త తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చిన్న చిన్న కారణాలకు ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్న వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.