వారిది అందమైన కాపురం. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల సంసారం సంతోషంగా సాగుతూ వచ్చింది. ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా గ్రామంలో ఆదర్శ దంపతులుగా మెలిగారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే భర్త రాక్షసుడిలా మారి పచ్చని కాపురంలో నిప్పులు పోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అందంగా సాగిన వీరి కాపురంలో తలెత్తిన వివాదం ఏంటి? భర్త రాక్షసుడిలా మారి ఎంతటి దారుణానికి పాల్పడ్డాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ గ్రామం. ఇక్కడే భీమయ్య (55) పెంటమ్మ (50) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. ఇక కూతుళ్లు పెరిగి పెద్దవారవ్వడంతో ఆ దంపతులు ఆ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కూడా చేసి అత్తారింటికి పంపించేశారు. ఇక అప్పటి నుంచి ఈ దంపతులు ఉన్నదాంట్లో సంతోషంగా కాపురాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి భర్త భీమయ్య మానసిక పరిస్థితి బాగా లేన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పెంటమ్మ భర్తకు అనేక ఆస్పత్రుల చుట్టు తిప్పి చికిత్స కూడా అందిస్తుంది.
ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఈ దంపతులు ఎప్పటిలాగే తిని పడుకున్నారు. ఇక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అర్థరాత్రి భర్త గొడ్డలి కామతో భార్య పెంటమ్మను కొట్టి చంపాడు. ఇక ఇంతటితో ఆగకుండా భీమయ్య దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం స్థానికులు గమనించి భీమయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా పెంటమ్మ రక్తపు మడుగులో పడి చనిపోగా, భర్త భీమయ్య దూలానికి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ ను చూసిన గ్రామస్తులు షాక్ కు గురయ్యారుజ. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.