Uttar Pradesh: తన ప్రియురాలితో మాట్లాడుతున్నాడన్న కోపంతో ఓ లా స్టూడెంట్ దారుణానికి ఒడిగట్టాడు. తోటి స్టూడెంట్ను క్లాస్లోనే కత్తితో పొడిచాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన 27 ఏళ్ల సుధాన్షు శేఖర్ లక్నోలోని ఓ లా కాలేజ్లో చదువుతున్నాడు. అదే కాలేజ్కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
ఆ అమ్మాయితో చనువుగా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే, కొద్దిరోజుల నుంచి సదరు అమ్మాయి సుధాన్షుతో మాట్లాడటం మానేసింది. చంద్ర భూషన్ అనే మరో విద్యార్థితో మాట్లాడసాగింది. వీరిద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ ఉండటంతో సుధాన్షు తట్టుకోలేకపోయాడు. సోమవారం మధ్యాహ్నం చంద్ర భూషన్పై తరగతి గదిలోనే కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ చంద్ర భూషన్ను ఆసుపత్రిలో చేర్పించారు.
బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు మంగళవారం మీడియాకు తెలిపారు. ఐసీయూలో ఉంచి మానిటర్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో కాల్ చేసి ప్రేమ బెదిరింపులు.. యువతి ఏం చేసిందంటే?..