మే 4న వివాహం. సాయంత్రం పెళ్లి అనగా కాబోయే భర్త పెళ్లి కూతురుకు ఫోన్ చేశాడు. అర్జెంట్ గా మనం కలవాలని చెప్పాడు. దీనికి సరేనంటూ పెళ్లి కూతురు వెళ్లింది. ఇద్దరు బైక్ పై నేరుగా అడవిలోకి వెళ్లారు. కట్ చేస్తే.. పెళ్లి కూతురు చెట్ల పొదట్లో శవమై కనిపించింది. అసలేం జరిగిందంటే?
వాళ్లిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. దీనికి ఇరువురి పెద్దలు కూడా అంగీకరించారు. ఇక పెళ్లి రోజు కూడా రానేవచ్చింది. సాయంత్రం వివాహం అనగా కాబోయే భర్త పెళ్లి కూతురికి ఫోన్ చేసి అర్జెంట్ గా మాట్లాడాలని పిలిచాడు. ఇద్దరు కలిసి బైక్ పై అడవుల్లోకి వెళ్లారు. కట్ చేస్తే.. పెళ్లి కూతురు కనిపించడం లేదంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పెళ్లి కూతురు అడవిలో శవమై తేలింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ జాంకీపురానికి చెందిన రాహుల్, మహానగర్ గుసియానాకు చెందిన కోమలి ఇద్దరు ప్రేమికులు. వీళ్లు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మొదట్లో ఆ యువతి ప్రియుడితో పెళ్లికి నిరాకరించింది. అనేక ప్రయత్నాలు చేసిన రాహుల్.. మొత్తానికి ప్రియురాలిని పెళ్లికి ఒప్పించాడు. ఇరువురి తల్లిదండ్రులు కూడా వీరి వివాహానికి అంగీకారం తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. మే 4న పెళ్లి. అందరూ పెళ్లి పనుల్లో బిజిగా ఉన్నారు. ఇక పెళ్లి రోజు కూడా రానేవచ్చింది.
అయితే సాయంత్రం పెళ్లి అనగా.. రాహుల్ కాబోయే భార్యకు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. కోమలి బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. ఇక ఆ యువతి రాగానే రాహుల్ బైక్ పై ఎక్కించుకుని నేరుగా స్థానికంగా ఉండే ఓ అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇద్దరు గొడవ పడినట్లు తెలుస్తుంది. దీంతో కోపంతో ఊగిపోయిన రాహుల్.. కత్తితో కాబోయే భార్య కోమలిని అతి దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం ఆమె శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. పెళ్లి సమయం దగ్గర పడుతుండడంతో కూతురు ఇంటికి రాలేదు. దీంతో తండ్రి వెంటనే కోమలికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఖంగారుపడి కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. కానీ, యువతి ఆచూకి మాత్రం లభించలేదు.
ఇక చేసేదేంలేక కోమలి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాబోయే భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నాకేం తెలియదు అన్నట్లుగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. చివరికి పోలీసుల స్టైల్ లో విచారించేసరికి రాహుల్ అసలు నిజాలు బయటపెట్టాడు. కోమలిని నేనే హత్య చేశానని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అడవిలో ఉన్న కోమలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులు నుంచి వీళ్లిద్దరూ తరుచు గొడవ పడుతున్నట్లు సమచారం. దీని కారణంగానే నిందితుడు కాబోయే భార్యను దారుణంగా హత్య చేశాడని తెలుస్తుంది. పెళ్లి రోజే కాబోయే భార్యను దారుణంగా చంపిన నిందితుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.