అది మధ్యాహ్న సమయం. అందరూ ఎవరు పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కానీ, అక్కడే ఉన్న ఓ యువకుడు రెచ్చిపోయాడు. అందరూ చూస్తున్నారన్న భయం, బుగులు లేకుండా దర్జాగా బరితెగించాడు. అసలేం జరిగిందంటే?
అది పట్టపగలు మిట్ట మధ్యాహ్నం. రోడ్డుపై వాహనాలతో ఎవరి పనుల్లో వాళ్లు వెళ్తున్నారు. అయితే అక్కడే ఉన్న ఓ యువకుడు మాత్రం పట్టపగలు రెచ్చిపోయాడు. అందరూ చూస్తున్నారన్న భయం, బుగులు లేకుండా దర్జాగా బరితెగించాడు. అతను చేసిందంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ యువకుడు ఏం చేశాడు? అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ వార్త చదవండి.
అది ఉత్తర్ ప్రదేశ్ లక్నాలోని జాంకీపురం ప్రాంతం. ఇక్కడే ఓ రోడ్డు పక్కన ఉన్న ఓ షాపు ముందు ఓ యువకుడు నిలబడ్డాడు. అతడి ముందు నుంచి వందలాది మంది వాహనాలతో వెళ్తున్నారు. అయితే.. పక్కా ప్లాన్ తో అక్కడికి వచ్చిన ఆ యువకుడు.. పక్కనే ఉన్న నగల దుకాణంపై కన్నేశాడు. ఎలాగైన అందులో ఉన్న నగలు, డబ్బులు దోచుకోవాలని ప్లాన్ రచించాడు. ఇక ఇందులో భాగంగానే ఎలాంటి బెరుకు లేకుండా దర్జాగా ఆ నగల షాపు తనదే అన్నట్లుగా షేటర్ తెరిచాడు. ఆ తర్వాత మెల్లగా ఆ షాపులోకి వెళ్లి.. అందులో ఉన్న నగలు, డబ్బు దోచుకుని ఏం ఎరుగనట్లుగా అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ షాపు యజమాని వచ్చి చూడగా.. తన షాపులో దొంగతనం జరిగిందని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఎవరు దొంగతనం చేశారో తెలియక నెత్తినోరు బాదుకున్నాడు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) February 18, 2023