భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. రాత్రి తిట్టుకుని ఉదయం వరకు కలిసి పోతుంటారు. ఇక గొడవ మరీ పెద్దదైతే వాళ్లు మాట్లాడుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అయితే కాస్త బరితెగించిన ఓ భర్త తాగొచ్చి భార్యపై గొడవ చేసేవాడే. కొన్నాళ్లు భరించిన భార్య పూర్తిగా సహనం కోల్పోయి భర్తపై పగ తీర్చుకుంది. ఎవరూ ఊహించని రీతిలో దాడి చేసి భర్తకు ఝలక్ ఇచ్చింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బరేలీలో మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసై కొంత కాలం నుంచి భార్య, పిల్లలను కొడుతు వేధించేవాడు. ప్రతీరోజు మద్యం తాగి వచ్చి.. భార్య ఫర్హాతో పాటు నాలుగేళ్ల కుమార్తెను కూడా తీవ్రంగా దాడి చేసేవాడు. తాగుడు మానేయాలని భార్య ఎంత చెప్పిన వినకుండా అదే పనిగా విర్రవీగేవాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తాగి ఇంటికొచ్చిన భర్త.. భార్యపై చేయి చేసుకున్నాడు. ఇక కోపంతో ఊగిపోయిన ఆ ఇల్లాలు కాళిమాత అవతారమెత్తింది. ఏకంగా యాసిడ్ లో కారం కలిపి భర్త నిద్రించాక అతనిపై పోసి అక్కడి నుంచి పరారైంది.
ఇది గమనించిన అత్తింటి కుటుంబ సభ్యులు హుటాహుటిన అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం యాసీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సీరియస్ అయిన యాసీన్ కుటుంబ సభ్యులు ఫర్హాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. భర్త వేధింపులను భరించలేకపోయి భర్తపై పగ తీర్చుకున్న ఫర్హా తీరు కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.