అన్ని ప్రేమలు స్వచ్ఛమైనవి కావు. కొన్ని ప్రేమల్లో కల్తీ ఉంటుంది. అవసరాల కోసం ఆ ప్రేమలు పుడతాయి. అవసరాల కోసం పుట్టే ప్రేమలు ఎక్కువ కాలం నిలువవు. కొన్ని సార్లు దారుణమైన మూల్యాన్ని కోరుకుంటాయి. తాజాగా, ఓ లేడీ డ్యాన్సర్తో ప్రేమ ఓ బిజినెస్మ్యాన్ ప్రాణాలు తీసింది. హనీ ట్రాప్లో చిక్కిన అతడు మృత్యువాతపడ్డాడు. డ్యాన్సర్ కుటుంబసభ్యుల బెదిరింపులకు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని, చిమన్గంజ్కు చెందిన గుడియా అనే యువతికి అదే ప్రాంతానికి చెందిన రాహుల్ అనే వ్యక్తితో చాలా కాలం క్రితమే పెళ్లయింది. దంపతులకు ఐదేళ్ల ఓ పాప కూడా ఉంది.
అయితే, గుడియా విలాసవంతమైన జీవితం గడపాలని ఎప్పుడూ భావించేది. ఇందుకోసం భర్తను ఇబ్బంది పెట్టేది. ఈ నేపథ్యంలోనే భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇక అప్పటినుంచి గుడియా కాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. పార్ట్టైంగా ఆర్కేస్ట్రాలో డ్యాన్సులు కూడా చేస్తుంటుంది. సిటీలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్ వినీత్.. ఆమె డ్యాన్స్ షో చూసి ముగ్ధుడయ్యాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. దీన్ని గుడియా, ఆమె కుటుంబసభ్యులు సరైన అవకాశంగా భావించారు. గుడియా, వినీత్తో ప్రేమను నటించింది. అతడు ఆమెను గుడ్డిగా నమ్మేశాడు. ఆమె కుటుంబం కోసం ప్రతినెల రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసేవాడు.
ఇష్టం లేకపోయినా ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో వినీత్కు బాధేసింది. లక్షల ఖర్చు తగ్గించమని వారిని కోరటంతో గొడవ మొదలైంది. గుడియా మనసేంటో అర్థం చేసుకున్న వినీత్ ఇకపై డబ్బులు ఖర్చు చేయనని స్పష్టం చేశాడు. వినీత్ నిర్ణయం గుడియా కుటుంబానికి నచ్చలేదు. వినీత్ పరువు తీస్తామని హెచ్చరించారు. గుడియా, వినీత్ కలిసున్న ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. గుడియా కుటుంబం బెదిరింపులతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుడియా కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.