ఆ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ రెండు సంవత్సరాల పాప పుట్టిన రోజు ఎంతో సంతోషంతో చేస్తున్నారు ఆ దంపతులు.. అందరూ చల్లగా నిండు నూరేళ్లు జీవించాలని దీవెనలు అందించారు.. కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్నా ఆ చిన్నారి మృత్యువడిలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: అనుమానంతో ఫోన్ చెక్ చేసిన తల్లిదండ్రులు! కోరిక తీర్చాలంటూ..!
కారుమంచి శివ, బన్ను దంపతులకు రెండు సంవత్సరాల పాప ఉంది. తమ పాప తేజస్వినికి పుట్టినరోజు వేడుకలు ఎంతో సంతోషంగా చేశారు. బంధుమిత్రులను ఆహ్వానించి తమ చిన్నారిని మనసారా దీవించమని కోరారు. అప్పటి వరకు అక్కడే ఆడుకుంటున్న చిన్నారి తేజస్విని భోజనాలు జరిగే ప్రాంతంలో కుర్చీలో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా సాంబార్ గిన్నెలో పడిపోయింది. ఆ సాంబారు గిన్నె వేడితో మసలిపోతుంది. పాపను బయటకు తీసి కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు తిరువూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యం చేయడం కుదరదని.. పాపకు మెరుదైన చికిత్స అందించాల్సి ఉంటుందని డాక్టర్లు సలహా ఇచ్చారు. వెంటనే విజయవాడలోని హాస్పిటల్కు తరలించారు. కాగా, ఆ పాప చికిత్స పొందుతూ చనిపోయింది.
ఇది చదవండి: ప్రాణం తీసిన సిగరెట్.. ఇలా కూడా జరుగుతుందా..?
పుట్టిన రోజునాడు వేడుకలప్పుడు అంతా సంతోషంలో ఉండగా ఇలాంటి ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తన పాప పుట్టిన రోజునాడే ఇలాంటి దుర్ఘటన జరగడం పట్ల ఆ తల్లి పడ్డ ఆవేదన.. పెట్టిన కన్నీరు అక్కడ ఉన్నవారందరికీ కన్నీరు పెట్టించాయి. పాప కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.