మనిషి జీవితంలో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని కొన్ని అనుకోకుండా జరిగిపోతే.. మరికొన్ని ఏమరపాటు, పొరపాటు వల్ల జరుగుతుంటాయి. ప్రమాదం ఎలా జరిగిన మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదు. అలా ఓ యువతి చేసిన పొరపాటో, ఏమరపాటో తెలియదు గానీ ఆమె ప్రాణాలు పోయాయి. గోడపై ఉన్న ఎలుకల మందును పేస్ట్ అనుకుని పళ్లు తోముకుంది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో చికిత్స పొందతూ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. మంగళూరు జిల్లా సూళ్యకు చెందిన శ్రావ్య(22) సోమవారం ఉదయం లేవగానే బ్రష్ చేసింది. ఆ సమయంలో ఆమె పేస్ట్ అనుకుని పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కాసేపటికే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అసలు బాత్ రూమ్ లో ఎలుకల మందు ఎందుకు ఉంది. ఆమె పొరపాటున అలా చేసిందా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.