దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది చెందుతుంది. కానీ ఇప్పటికీ కొంతమంది కులాలు, మతాలు అంటూ వాటి వెంటే తిరుగుతున్నారు. తమ కులం, మతం కానివారిని ప్రేమించారని సొంతవాళ్లనే చంపుకుంటున్నారు.
ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ.. భారత దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ, విద్యా, వైద్య రంగాల్లో ఎంతో అభివృద్ది సాధిస్తుంది. దేశం ఎంత పురోగాభివృద్ది సాధిస్తున్నా.. ఇప్పటికీ కొంతమంది ప్రజలు కులాలు, మతాలు అంటూ కొట్టుకుంటూనే ఉన్నారు. తమ కులం, మతం కానివారిని ప్రేమించారని కొంతమంది తల్లిదండ్రులు సొంత పిల్లలను చంపుకుంటున్నారు. కులాంతర వ్యక్తిని ప్రేమించిందని కూతురు గొంతు నొక్కి హత్య చేశాడు తండ్రి.. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది.. కానీ ఇప్పటికీ కులం, మతం అంటూ కొంతమంది కొట్టుకుంటూనే ఉన్నారు. తమ కులం కాదని.. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఓ తండ్రి దారుణానికి పాల్పపడ్డాడు. కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) లోని బంగారు పేటలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. ఆయనకు కీర్తి అనే 20 ఏళ్ల కూతురు ఉంది. గత కొంతకాలంగా కీర్తి.. గంగాధర్ (24) అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలోనే కొన్ని రోజులుగా తండ్రి, కూతురు కి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
తన కూతురు తమ కులం వాడిని కాదని వేరే యువకుడిని ప్రేమించడం, పెళ్లి చేసుకుంటానని పదే పదే చెప్పడంతో కృష్ణమూర్తికి కోపం కట్టలు తెంచుకుంది.. మంగళవారం కీర్తి గొంతు నొక్కి ఆమెను హత్య చేసి చంపేశాడు. అనంతరం కీర్తి మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్ కి వేలాదీసి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని జనాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. తరుచూ కూతురితో గొడవ పడటం చూసిన చుట్టుపక్కల వాళ్లు కృష్ణమూర్తిపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు. మరోవైపు తన ప్రియురాలు చనిపోయిందని ప్రియుడు గంగాధర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రైలు పట్టాల వద్దకు వెళ్లి వేగంగా వస్తున్న రైలు కింద పడి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గంగాధర ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్నారు. రెండు ఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.