మనిషికి జీవితం నీటి బుడగలాంటి. ఎప్పుడు పేలిపోతుందో చెప్పలేము. మనిషి పుట్టుక ఎంత నిజమో, మరణం అంతే నిజం. హాయిగా ఉందనుకున్న జీవితంలో అనుకోను ఘటనలు జరిగి విషాదాన్ని నింపుతాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ పాప కుటుంబంలో అందరికి కంటే చిన్నది. అందరూ ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఆ పాప.. ఆ కుటుంబ నుంచి దూరమైంది. నిద్రిస్తున్నా ఆ పాపను ఒకేసారి రెండు పాములు కాటేశాయి. దీంతో ఆ పాప మృతిచెందింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా నందవరం మండలం నదికైర వాడి గ్రామానికి చెందిన చాకలి నాగరాజు, నరసమ్మ దంపతులు. వీరికి ముగ్గుర పిల్లలలు. మూడవ కుమార్తె(15) మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. గత మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి రేకుల కొట్టంలో పడుకుంది. సుమారు 11 గంటల సమయంలో తన చేతికి, కాలికి ఏదో కరిచిందని మల్లేశ్వరి నిద్రలేచి తండ్రికి చెప్పింది. దీంతో నాగరాజు లైట్లు వేసి చూడగా.. ఆ పాప చేతి వద్ద ఓ పాము, కాలు వద్ద పాము కనపడ్డాయి. వాటిని వెంటనే చంపి.. కుమార్తెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కర్నూలు తీసుకెళ్లమని సూచించారు.
అక్కడి నుంచి అంబులెన్స్ లో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మల్లేశ్వరి ఆరోగ్యం విషమించి మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్టు మార్టం నిర్వహించారు.అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో కుటుంబం సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Krishna District: తల్లీ, కూతుళ్లపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది!
ఇదీ చదవండి: Tirupati: వరకట్న పిశాచి.. కిలో బంగారం, 10కిలోల వెండి.. రూ.50 లక్షలతో పెళ్లి.. అయినా సరిపోలేదు.. చివరకు!
ఇదీ చదవండి: Video: జవాన్ కి ఆ చిన్నారి చేసిన పని చూస్తే సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు..