కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమని నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా అడ్డుకున్న కుటుంబ సభ్యులపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. భర్త నాగేశ్వరరావు 2013 లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్ సంవత్సర కాలంగా ప్రేమించమంటూ వెంటపడి వేధిస్తున్నాడు.
ఆమె తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో గురువారం రాత్రి కత్తి తీసుకుని యువతి ఇంటికి వచ్చాడు. ముందుగా ఇంటి బయట ఉన్న ఆమె చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి తల్లి, మరో సోదరిపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో జోయల్ పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత కుటుంబాన్ని స్థానికులు హుటాహుటిన మొవ్వ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రేమని తిరస్కరించిన కారణంగా ప్రేమించిన యువతిపై, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసిన నీచుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Tirupati: వరకట్న పిశాచి.. కిలో బంగారం, 10కిలోల వెండి.. రూ.50 లక్షలతో పెళ్లి.. అయినా సరిపోలేదు.. చివరకు!
ఇది కూడా చదవండి: Bhadrachalam: భద్రాచలం వరదల్లో కొత్త కష్టం! సామాను ఎత్తుకెళ్తున్న దొంగలు!