ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ.., తప్పు చేసే వారిని పోలీసులు అడ్డుకుంటారు. అది వారి డ్యూటీ. ఫుల్ గా మద్యం తాగి, బండిపై వస్తున్న ఓ వ్యక్తిని లేడీ ఎస్సై థెరిసా ఇలాగే అడ్డుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయబోతుంటే.. మహిళా పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. ఎస్సై థెరిసా అతనికి దేహశుద్ధి చేయడమే కాకుండా జరిమానా కూడా విధించి వదిలేసింది. అయితే.. ఇదే ఇప్పుడు ఆమె ప్రాణం మీదకి తీసుకొచ్చింది. తన డ్యూటీని తాను పూర్తి చేసినందుకు సదురు ఎస్సై పై హత్యాయత్నం చేశాడు సదురు వాహనదారుడు. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన చెన్నైలోని పలవూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి పోలీస్ స్టేషన్లో మార్గెడ్ థెరిసా మహిళా యువ ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది. సత్తుమల్లికి చెందిన ఆర్ముగం అనే గత నెలలో మద్యం తాగి బండి నడుపుతూ వస్తున్న సమయంలో ఎస్ఐ మార్గెడ్ థెరిసా అతన్ని అడ్డుకుంది. ఆ సమయంలో ఆర్ముగం తప్పుగా ప్రవర్తించడంతో అతనికి దేహశుద్ది చేసి, జరిమానా విధించింది. ఈ ఘటనతో ఆర్ముగం ఎస్సై పై కక్ష పెంచుకున్నాడు. ఆమెని ఎలా అయినా అంతమొందించాలని అదును కోసం ఎదురుచూశాడు.
తాజాగా పలవూరు గ్రామంలో ఉత్సవాల భద్రతకు ఎస్సై థెరిసా వెళ్లారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆమె పై ఆర్ముగం దాడి చేశాడు. కత్తితో గొంతు కొసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు, విధుల్లో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ థెరిసాను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తిరునల్వేలిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం ఎంకే స్టాలిన్ ఎస్ఐ థెరిసాను ఫోన్ ద్వారా పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియోను ప్రకటించారు. మరి.. మహిళా ఎస్సై పైనే ఇలా దాడి జరిగితే.. సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.