నేటికాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. మనుషుల్లో వావివరుసలు కనుమరుగవుతున్నాయి. జీవిత భాగస్వామి కళ్లగప్పి కొందరు పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా తమ శారీరక సుఖం కోసం జీవితాతం తోడు ఉండే జీవిత భాగస్వామిని దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఓ మహిళ పరాయి వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుంది. ఇది తెలిసి.. నిలదీసిన భర్తను, ప్రియుడితో కలసి హతమార్చింది. దీనికి ఆమె మేనత్త కూడా సహకరించింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లాలో గతేడాది ఆగష్టు 7న చోటు చేసుకుంది. తొమ్మిది నెలల తరువాత తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రుత్తల సత్తి బాబు, రామలక్ష్మిలకు గత కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి సంసారం హాయిగా సాగింది. ఈ క్రమంలో రామలక్ష్మి బుద్ధి వక్రమార్గం వైపు చూసింది. రామలక్ష్మి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడుతో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో తరచూ తాగి వచ్చి భార్య రామలక్ష్మితో గొడవ పడేవాడు. ఈ విషయాన్ని ప్రియుడు ఎర్రినాయుడికి రామలక్ష్మి తెలిపింది. దీంతో సత్తిబాబును హతమార్చాలని రామలక్ష్మి, ఆమె ప్రియుడు, ఆమె మేనత్త సన్యాసమ్మ పథకం వేశారు. సత్తిబాబును అంతమొందించడానికి రూ.50 వేలు ఇచ్చేందుకు అదే గ్రామానికి చెందిన కర్రి కృష్ణతో పాటు ఎర్రినాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇదీ చదవండి: ఎదురించి ప్రేమించినోడినే పెళ్లి చేసుకున్నా.. కోరుకున్న వాడితో నెల రోజులు కూడా ఉండలేకపోయింది!సత్తిబాబుకు మద్యపానం, పేకాట అలవాటు ఉంది. అతని బలహీనతను అవకాశంగా తీసుకుని గత ఏడాది ఆగస్టు 7న సత్తిబాబుకు ఫోన్ చేసి మాకవరపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎర్రినాయుడు,కృష్ణ నమ్మబలికారు. సత్తిబాబుతో ఫుల్గా మద్యం తాగించి.. అనంతరం కిందపడేసి గొంతునొక్కి పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడేశారు. సత్తిబాబు కనిపించడపోవడంతో అతడి తండ్రి దేముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడలు రామలక్ష్మిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేస్తుండగా ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు.
తరువాత ఈ నెల 27న గ్రామ వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మను విచారించగా తామే కడతేర్చామని చేశామని అంగీకరించారు. సంఘటన జరిగి దాదాపు తొమ్మిది నెలలు కావడంతో సత్తిబాబు మృతదేహం లభ్యం కాలేదు. ఇలా నేటికాలంలో వివాహేతర సంబంధాల కారణంగా అనేక మంది అమాయకులు బలైపోతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.