వాళ్లిద్దరూ వరుసకు అక్కా చెల్లుళ్లు. ఓ యువతి డిగ్రీ చదువుతుండగా, మరో యువతి బీటెక్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. వీళ్లిద్దరి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అక్కా చెల్లెళ్లు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
రజిత, నీరజ వరుసకు అక్కా చెల్లెళ్లు. రజిత ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగా, నీరజ బీటెక్ చేస్తుంది. రోజూ కాలేజీకి వెళ్తూ వస్తుండేవారు. ఇదిలా ఉంటే.. రజిత తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి భయంతో వణికిపోయింది. ఈ క్రమంలోనే నీరజకు కూడా ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అయితే ఈ క్రమంలోనే ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా ఓజిలి మండలం కొత్తపేట గ్రామంలో రజిత (21) అనే యువతి తల్లిదండ్రులతో ఉంటూ ఉంటూ డిగ్రీ చదువుతుంది. ఇదే గ్రామానికి చెందిన బట్టా సురేష్ కూతురు నీరజ కూడా స్థానికంగా ఉండే ఓ కాలేజీ బీటెక్ చేస్తుంది. అయితే వరుసకు నీరజ, రజిత ఇద్దరూ అక్కా చెల్లెల్లు కావడం విశేషం. ఇకపోతే రజిత తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి షాక్ గురైంది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తరుచు బాధపడుతుంది. ఈ క్రమంలోనే రజితకు కూడా ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ అక్కా చెల్లెళ్లకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
దీంతో ఇద్దరూ ఓ రోజు కలిసి మాట్లాడుకున్నారు. ఇక ఆదివారం స్కూటీ నేర్చుకుంటామని ఇంట్లో చెప్పి గ్రామ శివారులోకి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ వారితో పాటు కూల్ డ్రింక్ లో విషం కలుపుకుని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక అదే కూల్ డ్రింక్ ఇద్దరు కలిసి తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన కొందరు రైతులు.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజిత మృతి చెందగా, నీరజ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రజిత మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.