ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా ధర విపరీతంగా పెరిగిపోతుంది. నెల రోజుల క్రితం రూ. 10 పలికిన టమాటా ఇప్పుడు రూ.150 పైగా ధర పలుకుతుంది. రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది.
ఈ మద్య కాలంలో నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం వాడే రోజువారీ వస్తువుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వీటితోనే నానా తంటాలు పడుతుంటే.. ఇప్పుడు మార్కెట్లో కూరగాయాలు కూడా జనాలను భయపెడుతున్నాయి. ఈ మద్య టమాటా, పచ్చిమిర్చి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీంతో దొంగల కన్ను టమాటాలపై పడింది. పలు చోట్ల టమాటా, మిర్చి దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా దొంగలు రూ.2 లక్షలు విలువచేసే టమాటా బస్తాలను చోరీ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య దేశ వ్యాప్తంగా టమాటా రేట్లు భగభగ మండిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు టమాటాను బంగారంగా చూస్తున్నారు. మొన్నటి వరకు రూ. 10 నుంచి రూ.20 వరకు పలికిన టమాటా ఒక్కసారే రూ.120 నుంచి రూ.180 వరకు పెరిగిపోయింది. దీంతో దొంగల కన్ను టమాటాలపై పడింది. కర్ణాటకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రూ.2.5 లక్షల విలువ చేసే టమాటాలను దొంగలు చోరీ చేశారు. కర్ణాటక.. హసన్ జిల్లాలోని గోని సోమనహళ్లీ గ్రామంలో ధరణి అనే ఓ మహిళా రైతు.. తన పొలంలో టమాటా సాగుచేస్తుంది. ప్రస్తుతం కర్ణాటకలో టమాటా కిలో రూ.120 కి పైగా పలుకుతుంది. పంట చేతికి వచ్చింది.. రెండు రోజుల్లో బెంగుళూరు మార్కెట్ కి తరలించి విక్రయించాలని భావించింది.
అంతలోనే దారుణం జరిగింది. మంగళవారం రాత్రి టమాటా తోటలో దొంగలు పడ్డారు. దాదాపు 50 నుంచి 60 బ్యాగుల టమాటాను దొంగిలించుకుపోయారు. అంతేకాదు పంటను కూడా ధ్వంసం చేశారు. చోరీ కాబడ్డ టమాటా రెండు లక్షలకు పైగా విలువ చేస్తుందని మహిళా రైతు కన్నీరు మున్నీరయ్యింది. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తనకు ఉన్న రెండు ఎకరాల్లో టమాటా పండించానని.. ప్రస్తుతం మంచి ధర పలకడంతో మార్కెట్ లో విక్రయించి తనకు ఉన్న అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంలో ఉండగా.. దొంగల తమ పొట్ట కొట్టారని కన్నీళ్లు పెట్టుకుంది మహిళా రైతు ధరణి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కర్నాటకలో దొంగలు రాత్రికి రాత్రే రెండున్న లక్షల రూపాయల విలువైన టొమాటోలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. #Karnataka #Tomato #Thief #Farmers #BBCTelugu pic.twitter.com/RW3hAxnWr0
— BBC News Telugu (@bbcnewstelugu) July 6, 2023