ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పూజ వర్మ అనే యువతి రాకేష్ అనే యువకుడి ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రతి రోజు ఫోన్లో మాట్లాడటం సరదాగా ఉండటం అంతా జరిగిపోతూనే ఉంది. అలా వాళ్ల ప్రేమ వ్యవహారం కాస్త రోజులు గడుస్తూ సంవత్సరాల వరకూ వెళ్లింది. ఇక కొన్నాళ్ల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఆ యువతికి రాజేశ్ వర్మ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపారు. ఇక వాళ్ల పెళ్లి అనంతరం ఉద్యోగ నిమ్మిత్తం భార్య భర్తలు మూడు నెలల కిందట హైదరాబాద్లోని వినాయక్ నగర్లో నివాసముంటున్నారు.
భర్త ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలా వారి జీవితం బాగానే గడుస్తోంది. కానీ పెళ్లైన ఆ యువతి మాత్రం మాజీ ప్రియుడు రాకేష్తో తరుచు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దీంతో నిన్ను చూడాలని ఉందని, నువ్వు హైదరాబాద్ రావాలని ప్రియుడుని కోరింది పూజా వర్మ. దీంతో ఆ ప్రియుడు ఓ స్నేహితుడిని వెంట పెట్టుకుని హైదరాబాద్లో వాలిపోయాడు. ఇక ఏకంగా ప్రియురాలి ఇంటికి చేరుకున్న ఆ ప్రియుడు ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఇక నా వళ్ల కావటం లేదని, ఇద్దరం కలసి ఉందామని సూచించాడు.
ఇక పెళ్లైన ప్రియురాలు ఆలోచించి తన భర్తను వదిలి రాలేనని సమాధానం ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరిపోయింది. ఇక కోపంతో రగిలిపోయిన ప్రియుడు దిండుతో ఊపిరాడకుండా చేసి ఆ యువతిని దారుణంగా హత్య చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే…? హత్య చేసిన అనంతరం నిందితులిద్దరూ మృతురాలి మంగళసూత్రం, బంగారు చైన్ లతో పరారయ్యారు. ఇక వెంటనే సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక పూజ వర్మ భర్త తెలిపిన వివరాల ప్రకారం నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.