ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంటే దీనికి ధీటుగా రంకెలేస్తున్నారు కొందరు మానవ మృగాలు. వయసుతో సంబంధం లేకుండా అడ్డొచ్చినా చెల్లిని, తల్లిని, అత్తని ఇలా ఎవరిని పడితే వారిపై అత్యాచార దాడులకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే తండ్రి లేని ఓ 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వృద్ధులు అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
ఇది కూడా చదవండి: Pakistan: పరువు హత్య: సోదరి చేసే పని నచ్చక తుపాకితో కాల్చిన అన్న
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని మధురై సమీపంలోని ఓ ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. అయితే గతంలోనే తండ్రి మరణించడంతో ఆ బాలిక తండ్రిలేని కూతురుగా మారింది. ఇక స్థానికంగా ఉండే బాలమురగన్ అనే ఓ వృద్ధుడు ఆ మైనర్ బాలికపై ఎప్పటి నుంచో ఓ కన్నేసి ఉంచాడు. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఆ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. అలా కొన్నాళ్లపాటు ఆ దుర్మార్గుడు బాలికపై కోరికలు తీర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మరో వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూ సదరు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
అయితే ఇటీవల ఆ బాలిక కడుపులో నొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్దారించారు. దీంతో షాక్ కు గురైన తల్లి కూతురిని అన్ని వివరాలు అడిగి పోలీసులకు నిందితులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. అభం శుభం తెలియని చిన్నారిపై వృద్ధులు చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.