నేటి కాలంలో కొందరు భార్యలు వివాహేతర సంబంధాల్లో చిక్కుకుని ప్రియుడి కోసం ఎంతకైన తెగిస్తున్నారు. కట్టుకున్నవాడిని కాదని పరాయి మగాడి మైకంలో పడి తాళి కట్టిన భర్తనే దారుణంగా హత్య చేస్తున్నారు. వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటున్న అనేక మంది మహిళలు అచ్చం ఇలాంటి దారుణాలకే పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ భర్తకు విషం పెట్టి దారుణంగా హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కొళత్తూరు, వీర భద్రన్ కోట్టే.
ఇదే గ్రామానికి చెందిన శక్తివేల్ (37), పుగళరసి (27) భార్యాభర్తలు. శక్తివేల్ రోజుకూలీగా పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. కొంత కాలం వీరిద్దరి వైవాహిక బంధం సాఫీగానే సాగింది. అయితే రోజులు గడిచే కొద్ది భార్య పక్క చూపులు చూసి పరాయి వాడితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. స్థానికంగా ఉండే ముత్తుకుమార్ అనే యువకుడితో పుగళరసి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే కొన్నాళ్లకి ఈ విషయం భర్తకు తెలిసింది. కోపంతో రగిలిపోయిన భర్త భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో భార్య భర్తపై కోపంతో ఊగిపోయింది.
ఇది కూడా చదవండి: Ongole: హర్షిత పెళ్లై మూడు నెలలే అయింది.. అంతలోనే!
ఎలాగైన భర్తను హత్య చేయాలని పథకం వేసింది. ఇందులో భాగంగానే భార్య ప్రియుడితో కలిసి భర్తకు మద్యం పీకల దాక తాగించి తినే అన్నంలో విషం కలిపింది. దీంతో ఆ ఆహారం తిన్న భర్త అక్కడికక్కడే మరణించాడు. దీనిపై స్పందించిన శక్తివేల్ కుటుంబ సభ్యులు భార్యపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా భర్తను చంపింది భార్యను అని తెలిసింది. దీంతో పుగళరసితో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.