మరణం ఎప్పుడు ఎలా.. ఎవరిని కబళిస్తుందో ఎవ్వరమూ ఊహించలేము. అప్పటివరకు ఎంతో సంతోషంగా.. నవ్వుతూ, తుళ్లుతూ తిరిగిన వారు కూడా చనిపోవచ్చు. ఇప్పుడే తిరిగొస్తానని ఇంటినుంచి వెళ్లిన వాళ్లు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవచ్చు. ‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించదరూ’’ అన్నట్లుగా జీవితం ఉంటుంది. చనిపోయిన వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిపోతుంది. తాజాగా, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ దంపతుల జీవితం అర్థాంతరంగా ముగిసింది. రోడ్డుపై కారులో వెళుతున్న వారిని చావు కంటైనర్ రూపంలో పలకరించింది. వారి కారు కంటైనర్ను ఢీకొట్టడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన కర్ణాటకలోని బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కలబురగి జిల్లాకు చెందిన రవి లూక్కుంద.. సిందగి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం భార్య మధుతో కలిసి కారులో సిందగి నుంచి కలబురగికి బయలుదేరాడు. కారు సోనా క్రాస్ వద్దకు చేరుకోగానే ఆగి ఉన్న ఓ కంటైనర్ లారిని ఢీకొట్టింది. కారు, కంటైనర్ను ఢీకొట్టిన వేగానికి దాని ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. లోపల ఉన్న ఇద్దరూ రెండిటి మధ్య నలిగి చనిపోయారు. రోడ్డుపై వెళుతున్న వారు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Karnataka | Two people were killed in an accident after their car rammed into a container truck near Sonna cross in Kalaburagi District. The deceased are identified as Sindagi PS Circle Inspector Ravi & his wife Madu. Case registered at Nelogi Police Station: Nelogi Police pic.twitter.com/K4QM29b2yE
— ANI (@ANI) December 7, 2022