వన్ సైడ్ లవ్ అన్నది ఎంతో అద్భుతమైనది. ఈ ప్రేమలో ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించడాలు ఉండవు. ఎదుటి వ్యక్తికి మన ప్రేమను చెప్పే వరకు ఎలాంటి గొడవలు ఉండవు. ఒక వేళ మన ప్రేమను ఎదుటి వ్యక్తికి చెప్పిన తర్వాత వాళ్లు కాదంటే తట్టుకోవటం చాలా కష్టం. కొంతమంది కాదనిపించుకుని మౌనంగా ఉండిపోతే.. మరికొంత మంది ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇలా ఎక్కువగా మగ వాళ్లు చేస్తుంటారు. ప్రేమను కాదన్నారన్న బాధలో ప్రాణం తీయటమో.. ప్రాణాలు తీసుకోవటమో చేస్తుంటారు. తాజాగా, ఓ వ్యక్తి వేరే పెళ్లి చేసుకున్న ప్రియురాలి జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నాడు. ఆమె భర్తను చంపటానికి ప్రయత్నించాడు.
ఈ సంఘటన మధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్, షియోపూర్ జిల్లా ఖారై జలిమ్ ప్రాంతానికి చెందిన నందిని అనే యువతికి రెండేళ్ల క్రితం ఖింజారీ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో పెళ్లయింది. పెళ్లి తర్వాత ఇద్దరూ జలీమ్ గ్రామంలోని మణియార్ ఏరియాలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఉమేష్ అనే యువకుడు జలిమ్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. నందిని కుటుంబంతో స్నేహంగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు యువతి భర్తను బైకుపై ఎక్కించుకుని ఊరికి దూరంగా తీసుకెళ్లాడు.
అక్కడ అతడిపై కత్తితో దాడి చేశాడు. నవీన్ గొంతు కోశాడు. అయితే, అతడినుంచి తప్పించుకున్న నవీన్.. గొంతుకు గుడ్డ చుట్టుకుని ఆసుపత్రికి చేరాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో తాను నందినిని ప్రేమించానని, ఆమెకు వేరే పెళ్లి అవ్వటంతో తట్టుకోలేకపోయానని చెప్పాడు. ఆమె తండ్రి ద్వారా నందినిని చేరటానికి ప్రయత్నించినా కుదరలేదని, ఈ నేపథ్యంలోనే నవీన్ను చంపటానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.