ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు కోపంతో ఊగిపోయి చివరికి కొట్టుకునే స్థాయికి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా చికెన్ మంచిది ఇవ్వలేదని కొందరు వ్యక్తులు ఏకంగా ఓనర్ పైనే దాడి చేశాడు. ఈ దాడిలో 10 మంది గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: చపాతీ ఎక్కువ తిన్నందుకు అత్తను చావగొట్టింది.. కోడలు పాపం పండి..
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ మండలంలో తిప్పాపురం గ్రామంలో గురువారం రాత్రి మాంసం మంచిది ఇవ్వలేదని కొందరు వ్యక్తులు ఓనర్ పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో భాగంగా రాళ్లతో, కర్రలతో కొట్టినట్లు సమాచారం. ఇక దీంతో ఆగకుండా చివరికి ఓనర్ తో పాటు మరో పది మందిపై యాసిడ్ దాడి చేశారట. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇక స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరి నిజంగానే మాంసం మంచిది ఇవ్వలేదని దాడి చేశారా? మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.