పది కాలాల పాటు సంతోషంగా సాగాల్సిన వైవాహిక జీవితాలు వివాహేతర సంబంధాల కారణంగా మధ్యలోని మిగిలిపోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెట్టి పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి ఘటనలోనే భార్య చేతిలో ఓ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది రాజస్థాన్ రాష్ట్రంలోని లాల్ సోట్ పరిధిలోని చౌంద్ సేన్ గ్రామం. ఓం ప్రకాష్ గుర్జార్, రేష్ట ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే భర్తతో పాటు వైవాహిక జీవితం బాగానే గడిపిన రేష్ట రోజుల గడిచే కొద్ది పక్క చూపులు చూసింది. దీంతో కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా పరాయి వాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత భార్య చీకటి కాపురం భర్తకు తెలిసింది.
ఇది కూడా చదవండి: Kukatpally: పెళ్లి కావట్లేదని మనస్థాపంతో యువతి బలవన్మరణం!
దీంతో అనేకసార్లు మందలించే ప్రయత్నం చేశాడు. అయినా భార్య బుద్ది మాత్రం మారలేదు. ఇలా అయితే ప్రియుడితో కలిసేందుకు వీలుండదని భావించిన భార్య ఏకంగా భర్త హత్యకు ప్లాన్ గీసింది. ఇక ఇటీవల భర్తతో పాటు అత్తకు రాత్రి పూట వడ్డించిన అన్నంలో మత్తు పదార్థాలు కలిపింది. ఆ ఆహారం తిన్న అత్తా, భర్త గాఢంగా నిద్రపోయారు. ఇదే సమయాన్ని అదునుగా భావించిన భార్య ప్రియుడిని ఇంటికి పిలుపించుకుంది.
దీంతో తెల్లవారు జామున నిద్రలో ఉన్న భర్తను భార్య ప్రియుడి సాయంతో గొడ్డలితో దారుణంగా నరికి చంపింది. ఈ దాడిలో రక్తపుమడుగులో పడి భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇక అనంతరం నిందితులైన రేష్టతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.