వాళ్లిద్దరు కొన్నేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలనుకుని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ ఆశలు చివరికి ఆడియాసలయ్యాయి. పెళ్లైనా భర్తతో ఉండలేక ప్రియురాలు ఏకంగా ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, పూజా ఇద్దరు ఇద్దరు స్థానికంగా గోపాల్ నగర్ లోని ఓ ప్రైవేట్ రిసెప్షన్ లో పని చేస్తున్నారు.
వేణుగోపాల్ మాత్రం వయసులో పూజా కన్న రెండేళ్ల చిన్నవాడు కావడం విశేషం. ఒకే దగ్గర పని చేస్తుండడంతో ఇద్దరి మధ్య పరిచయం కాస్త బలంగా మారడంతో చివరికి అది ప్రేమగా మారింది. ఇక పూజాకు తల్లిదండ్రులు మేనబావ అజయ్ అనే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పెళ్లి పూజాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రుల ఇష్టం మేరకు మేనబావను పెళ్లి చేసుకుంది. పెళ్లైన కూడా తన ప్రియుడిని పూజా తలుచుకుంటూ కాలాన్ని గడిపేది. అలా నాలుగేళ్లుగా ఇష్టం లేకున్నా పూజా భర్తతో కాపురాన్ని నెట్టుకుంటూ వచ్చింది.
ఇది కూడా చదవండి: Hyderabad: కామాంధుడిగా మారిన ర్యాపిడో డ్రైవర్.. కాలేజీ అమ్మాయిలే వీడి టార్గెట్!మరో విషయం ఏంటంటే? భర్తకు తెలియకుండా పూజా తన ప్రియుడైన వేణుగోపాల్ తో తిరుగుతూ వివాహేతర సంబంధాన్ని నడిపించేది. ఇక భర్తతో ఉండడం ఇష్టం లేని పూజా ప్రియుడి వద్దకు వెళ్లాలనుకుంది. దీనికి వేణుగోపాల్ కూడా ఓకే అన్నాడు. ఇక ఈ నెల రోజు లాగే బయటకు వెళ్లిన పూజా 15 నుంచి ఇంటికి రాలేదు. దీంతో ఖంగారు పడ్డ భర్త అటు ఇటు అంతా వెతికాడు. ఎక్కడ కూడా భార్యా జాడ కనిపించలేదు. చివరికి చేసేదేం లేక చివరికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రియుడితో పాటు వెళ్లిపోయిన పూజా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోకి బైక్ పై వెళ్లారు. ఇక వీరిద్దరి ప్రేమను ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించపోవడంతో ఇన్నాళ్లు భరించిన ఈ ప్రేమికులు ఇప్పడు మాత్రం భరించలేకపోయారు. ఇక బతకడం దండగా అనుకుని అక్కడే ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.