యువతి ప్రేమించడం లేదని కొందరు కేటుగాళ్లు ప్రేమించాలని ఒత్తిడికి గురి చేస్తూ వెంటపడతారు. చివరికి కాదు, కుదరదు అనేసరికి ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా బరితెగించిన యువకుడు సొంత మరదలిని దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని తిరుబువనం సన్యాసి కుప్పం.
ఇదే ప్రాంతంలో ముఖేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మద్యం అలవాటు ఉన్న ఇతడు తాగుడుకు బానిసై జులాయిగా తిరిగేవాడు. అయితే ముఖేష్ కు తన మేనత్త కూతురైన కీర్తన అనే యువతి ఉంది. ఆ యువతి స్థానికంగా డిగ్రీ చదువుతోంది. కాగా ఎప్పటి నుంచో ముఖేష్ మరదలు కీర్తనపై మనసుపడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆమెను వేధించేవాడు. ఇక ముఖేష్ చెడలవాట్లకు బానిస అవ్వడంతో కీర్తన అతని వంక కూడా చేసేది కాదు. సొంత మరదలే ఇలా పట్టించుకోకవడం లేదని ముఖేష్ ఆమెపై తీవ్ర కోపంతో ఊగి పోయాడు.
ఇది కూడా చదవండి: ఒకే ఆస్పత్రిలో భార్య.. మార్చురీలో భర్త.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!
దీంతో ఇటీవల మరదలి ఇంటికి వెళ్లిన ముఖేష్ నన్ను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి కీర్తన మరోసారి నేనే చేసుకోలేను అని తెగేసి చెప్పింది. ఇక ముఖేష్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. మరదలు అంత మాట అనేసరికి క్షణికావేశంలో తట్టుకోలేకపోయాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో మరదలు కీర్తనను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు కీర్తనను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ యువత మరణించిందని డాక్టర్లు ద్రువీకరించారు.
ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కీర్తన తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీర్తన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.