కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గత రెండు రోజుల కిందట మేనూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికి ఐదుగురు మృతదేహాలను గుర్తించిన పోలీసులు మరో మృతదేహం ఎవరిదని గుర్తించలేక ఆపసోపాలు పడ్డారు. ఇక ప్రమాదానికి గురైన ఆటోలు దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా మృతుడు మద్నూరు మండలం పెద్దతడ్గూర్ కు చెందిన చుక్కావార్ సురేష్ గా పోలీసులు గుర్తించి గుర్తించారు.
ఇదిలా ఉండగా సురేష్ భార్య రాహుబాయి గర్భవతి కావడంతో వారం రోజుల కిందట డెలవరీ కోసం బాన్సువాడ ఆస్పత్రిలో చేర్పించాడు. దీంతో భార్యను చూసేందుకని సురేష్ ఆటోలో బాన్సువాడకు పయనమయ్యాడు. దురదృష్టవశాత్తు అతను ప్రయాణిస్తున్న ఆటో మేనూరు పరిధిలోని జాతీమ రహదారిలో రోడ్డు ప్రమాదానికి గురై సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సురేష్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు బాన్సువాడ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
ఇది కూడా చదవండి: అన్న కొడుకే హంతకుడయ్యాడు.. ఒకే ఇంట్లో ముగ్గురిని చంపి!
అయితే ఒకే ఆస్పత్రిలో ప్రసవం కోసం భార్య చికిత్స పొందుతుండగా భర్త శవం మార్చురీలో ఉండడం చూసిన స్థానికులు కంటతడి పెడుతున్నారు. సురేష్ బంధువులు భార్యాభర్తలను ఒకే ఆస్పత్రిలో ఉండడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.