చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రికి వెళ్లినా కూడా టెస్టుల పేరుతో చాలావరకు బిల్ చేసి పేషెంట్లను గుళ్ల చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. సామాన్యులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో మాఫియా ఎలా చేస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చూపించారు. అలాంటిదే ఈ సంఘటన.
వైద్యం అనేది ఈ రోజుల్లో కమర్షియల్ రంగులు పులుముకుంది. వైద్య రంగంలోకి ప్రైవేట్ వ్యక్తుల చొరవ మొదలైంది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. లక్షల్లో డబ్బులు గుంజి జనాలను నిలువుదోపిడి చేస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రికి వెళ్లినా కూడా టెస్టుల పేరుతో చాలావరకు బిల్ చేసి పేషెంట్లను గుళ్ల చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. సామాన్యులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే నో ట్రీట్ మెంట్. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో మాఫియా ఎలా చేస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చూపించారు. శవానికి కూడా ట్రీట్ మెంట్ చేసి డబ్బులు దోచుకున్న ప్రైవేట్ ఆసుపత్రి సీన్ ఆ సినిమాకే హైలెట్. ఇప్పుడు అదే సీన్ పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిపీట్ అయింది.
కాకపోతే ఠాగూర్ మూవీలో డెడ్బాడీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఇక్కడ పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారంటూ డబ్బులు గుంజుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..పెద్దపల్లి జిల్లా కాపులపల్లి గ్రామానికి చెందిన సింగారపు సాయి కుమార్కు ఈ మధ్య కొంచెం సుస్తీ చేసింది. దీంతో అతడు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు సాయికుమార్ను పరీక్షించి ప్లేట్లెట్స్ పడిపోయాని చెప్పారు. అతనికి అత్యవసరంగా చికిత్స అందించాలని సూచించారు. లేట్ చేయకుండా ఆస్పత్రిలో జాయిన్ కావాలని తెలిపారు. లేకపోతే సాయికుమార్ ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. దీంతో సాయికుమార్కు అనుమానం వచ్చింది.
తను నీరసంగా లేకున్నా ట్రీట్మెంట్ అంటున్నారని సెకండ్ ఓపినియన్ కింద మరో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ప్లేట్లెట్స్ టెస్ట్ చేయించుకున్నాడు. అంతా నార్మల్గానే ఉన్నట్లు రిపోర్టుల్లో వచ్చింది. సాయికుమార్ తన బంధువులను తనతో తీసుకుని ముందుగా వెళ్లిన ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి.. తన తాజా రిపోర్టులను చూపించి వైద్యులను నిలదీశాడు. క్రిటికల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తర్వాత జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇలాంటి ఆస్పత్రిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొనన్నారు. ఇలాంటి ఆస్పత్రులు చాలా ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి