వైద్యం నేడు కమర్షియల్ రంగులు పులుముకుని కోరలు చాచుతోంది. కరోనా తర్వాత ప్రైవేటు వైద్యం మరింత ప్రియంగా మారింది. అదొక వ్యాపారంగా మారిపోయింది. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేదీ వైద్యులకే. కానీ డాక్టర్లు..
చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రికి వెళ్లినా కూడా టెస్టుల పేరుతో చాలావరకు బిల్ చేసి పేషెంట్లను గుళ్ల చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. సామాన్యులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో మాఫియా ఎలా చేస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చూపించారు. అలాంటిదే ఈ సంఘటన.