ఆమె పేరు సౌందర్య. పదవ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమె చదువుకోవడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఆ యువతి అప్పటి నుంచే ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. అలా కొన్నాళ్ల పాటు ఆ యువతి కాలాన్ని వెళ్లదీస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ యువతి పాల పాకెట్ కోసమని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. కానీ ఎంతకు కూడా ఆ యువతి తిరిగి రాలేదు. ఇక ఉన్నట్టుండి కూతురు కనిపించకుండపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అది పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామం. ఇక్కడే బుచ్చయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి సౌందర్య (25) అనే కూతురు జన్మించింది. పదవ తరగతి వరకు చదువుకున్న ఆ యువతి ఆ తర్వాత చదువుకునే వీలు కుదరలేదు. దీంతో అప్పటి నుంచే ఆ యువతి ఇంటి వద్దనే ఉండేది. ఇదిలా ఉంటే సౌందర్య ఇటీవల పాల పాకెట్ కోసమని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఇక చాలా సేపు అయినా సౌందర్య ఇంటికి రాలేదు.
దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఊళ్లో అంతా గాలించారు. ఎంత వెతికినా కూతురు జాడ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఖంగారుపడ్డ ఆ యువతి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.