ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి.. భార్య మద్యం తాగొద్దు అన్నందుకు మనస్థాపంతో జలాశయంలో దూకి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఇది ఎక్కడ జరిగిందంటే?
ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువులో రాణించలేకపోతున్నానని, జీవితంలో విఫలమయ్యానని, ప్రేమించిన వాడు మోసం చేశాడని.. ఇలా కారణాలు వేరైనా చివరికి ఆత్మహత్యే మార్గమని బలవన్మరణానికి పాల్పడుతూ కన్నవారికి కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇలాగే అనుకున్న ఓ భార్య.. మద్యం తాగొద్దన్నందుకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇది ఎక్కడ జరిగిందంటే?
అది ఏపీలోని పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట పరిధిలోని సాలూరు గ్రామం. ఇక్కడే పెంట రాములు (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో గంగా అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల పాటు ఈ భార్యాభర్తల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా రాను రాను భర్త తాగుడుకు బానిసయ్యాడు. ఇది మంచి పద్దతి కాదని, మద్యం తాగుడు మానేయ్యాలని భార్య ఎన్నోసార్లు చెప్పి చూసింది. అయినా వినని భర్త.. అదే పనిగా తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే భార్య గంగా గతంలో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది.
దీంతో ఇటీవల భర్త రాములు తన సోదరుడితో పాటు కలిసి అత్తింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక భర్త భార్యను ఇంటికి రావాలని కోరాడు. దీనికి నిరాకరించిన భార్య.. నువ్వు తాగుడు మానేస్తేనే వస్తానంటూ భార్య గంగా తెగేసి చెప్పింది. భార్య మాటలు విన్న భర్త రాములు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అటు నుంచి నేరుగా ఇంటికి వచ్చారు. అయితే ఈ సమయంలో రాములుకు ఏం చేయాలో అర్థంకాక స్థానికంగా ఉన్న ఓ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాములు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు.
అనంతరం రాములు సోదరుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాములు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్న భర్త నిర్ణయంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.