ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు మన మద్యలో ఉన్నవారు అకస్మాత్తుగా ప్రమాదాలకు గురై చనిపోవడం చూస్తుంటాం. ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పాలమూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగర్కర్నూలు జిల్లాలోని పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో విషాదం చోటుచేసుకుంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామునే క్రేన్ సాయంతో పంప్హౌస్లోకి దిగుతుండగా.. దానికి సంబంధించిన వైరు తెగిపడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు.
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.. మరొకరికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతదేహాలను హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, మృతులను బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.