నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఇక ఇంతటితో ఆగక విచక్షణ కోల్పోయి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో సరిపెట్టని ఈ కిరాతకుడు మరో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నిర్మల్ జిల్లా భైంసా పట్టణం దేగాంకు చెందిన జ్యోతి అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని 8 ఏళ్ల కిందట పెళ్లి చేసుకుంది.
పెళ్లైన చాలా రోజులు పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్నేళ్ల తర్వాత వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. కట్ చేస్తే.. పిల్లలు పెరిగి ఏడేళ్ల వయసుకొచ్చారు. అయితే భర్త రమేష్ మాత్రం సరిగ్గా పని చేయకుండా తాగుడుకు బానిసయ్యాడు. రోజు తాగి ఇంటికి వస్తూ.. డబ్బులు ఇవ్వాలంటూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో విసుగుచెందిన భార్య స్థానికంగా ఉండే ఓ బీడి కంపెనీలో కార్మికురాలిగా పనికి కుదిరింది. దీంతో తాను సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇకపోతే ఇటీవల భర్త రమేష్ తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ భార్య జ్యోతితో గొడవకు దిగాడు.
ఇదే విషయమై భర్త భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త తాగిన మత్తులో భార్యను అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా భార్యను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.