మన దేశంలో వివాహ వ్యవస్థకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి వివాహ వ్యవస్థను కొందరు నాశనం చేస్తున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని కాపురాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించాడో భర్త. పరాయి యువతితో రాసలీలలు సాగిస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అది ఏపీలోని నెల్లూరు జిల్లా ఇందకూరిపెంట. ఇదే గ్రామానికి చెందిన చలం వెంకటేష్,.. తోటపల్లి మండలం పోట్లపూడి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి గతంలో సుమచందు అనే యువతితో పెళ్లి జరిగింది. కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని ముందుకు నడిపారు. కానీ కొంత కాలం తర్వాత భర్త వెంకటేష్ తన బుద్దిని వక్రమార్గంలోకి మళ్లించాడు. ఇంతటితో ఆగకుండా పరాయి యువతిపై మనసుపడి ప్రియురాలితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.
అయితే కొన్ని రోజుల తర్వాత భర్త ప్రవర్తనపై భార్య సుమకు అనుమానం కలిగింది. అయితే భర్త ఓ రోజు తన ప్రియురాలితో ఓ హోటల్ లో ఉన్నాడని తెలుసుకుంది. వెంటనే తన బంధువులను వెంటపెట్టుకుని భర్త ప్రియురాలితో ఉన్న హోటల్ కు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీనిపై భార్య వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిద్దరికి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. ఇక ఇప్పటి నుంచైనా భర్త బుద్దిగా ఉంటాడని భార్య ఆశ పడింది. కానీ వెంకటేష్ వల్ల అది కాలేదు.
ఇటీవల భార్యకు తెలియకుండా వెంకటేష్ తన ప్రియురాలిని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో హుటాహుటిన భర్త వద్దకు వెళ్లి ఏదేందంటూ నిలదీసే ప్రయత్నం చేశాడు. కానీ వెంకటేష్ బంధువులు భార్య సుమపై దాడికి యత్నించారు. దీంతో బోరున విలపించిన సుమ తనకు భర్త అన్యాయం చేశాడంటూ పోలీసుల ముందు మొరపెట్టుకుంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.