ఈ మద్య కొంతమంది మనుషులు చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అన్న విషయం మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి తన భార్యపై గొడవ పడి ఇద్దరు చిన్నారులను దారుణంగా గొంతు కోసి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కొల్లాపూర్ మండలానికి చెందిన ఓంకార్ గత కొంత కాలంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓంకార్ తన మొదటి భార్య చనిపోయిన తర్వాత జావాయిపల్లి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత రోజూ తాగిరావడంతో ఇద్దరి మద్య గొడవలు మొదలయ్యాయి. కొన్ని రోజులు తర్వాత ఆమె ఓంకార్ ని వదిలేసి పుట్టింటికి వెళ్లి పోయింది. ఆ తర్వాత మల్లేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు.
వీరికి విశ్వనాథం (7), చందన (3) పిల్లలు ఉన్నారు. బుధవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తాన మాయమాటలు చెప్పి భార్య, పిల్లలను తీసుకొని తన వాహనంపై ఎక్కించుకుని నాగర్కర్నూల్కు బయల్దేరాడు. ఈ క్రమంలో మరోసారి భార్యాభర్తల మద్య గొడవ జరగడంతో ఆమెను బైక్ పై నుంచి తోసి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. రోడ్డు పక్కన తన వాహనం ఆపి నిర్మానుశ్య ప్రదేశానికి పిల్లలను తీసుకు వెళ్లి దారుణంగా గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తాను గొంతు కోసుకున్నాడు.. కానీ నొప్పి భరించలేక రోడ్డు పైకి వచ్చాడు.
అటుగా వెళ్తున్న కొంతమంది ఓంకార్ పరిస్థితి చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి అన్ని వివరాలు సేకరించి.. అతడిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు గుట్టపైకి వెళ్లి చూడగా ఇద్దరి పిల్లలు విగతజీవులుగా కనిపించారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.