ఉన్నత కుటుంబాల్లోని కొత్తగా పెళ్లైన జంటలు మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని అక్కడికి చెక్కేస్తుంటారు. ఇక పెళ్లైన జంటలతో పాటు ప్రేమ జంటలు కూడా అక్కడ వాలిపోతుంటారు. అలా కొన్ని రోజులు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ జీవితంలో మరిచిపోని మాధురానిభూతిని పొందాలనుకుంటారు. అలాగే ముంబైకి చెందిన ఓ వ్యక్తి రహస్యంగా ప్రియురాలితో మాల్దీవులకు వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే ఇటీవల తన భార్య ఆఫీసు పనిమీద విదేశాలకు వెళ్లింది. ఇక భర్త ఇదే సరైన సమయమని అనుకున్నాడు. భార్య గడపదాటగానే తన ప్రియురాలితో వెంటనే మాల్దీవుల్లో వాలిపోయాడు.
ఇక అక్కడికి వెళ్లగానే అతని భార్య వాట్సాప్ కాల్ చేసింది. దీంతో భర్త ఒక్కసారిగా నోట్లో నీళ్లు నమిలాడు. ఎంత చేసినా కూడా భార్య లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య అదే పనిగా భర్తకు కాల్ చేస్తూనే ఉంది. దీంతో వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని భావించిన భర్త ఇక్కడికి వచ్చిన విషయం భార్యకు తెలియకుండా ఉండేందుకు పాస్ పోర్ట్ లోని కొన్ని పేజీలను చింపేసి ఇండియాకు చెక్కేశాడు. అయితే ఆ వ్యక్తి గురువారం ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అందరి పాస్ పోర్టులు చెక్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: డబ్బుల కోసం భార్యను స్నేహితుల పక్కలోకి పంపిన భర్త!
అయితే ఈ వ్యక్తి పాస్ పోర్టులోని కొన్ని పేజీలు కనిపించకపోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అతనిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏం చెప్పలో తెలియక తలతిక్క సమాధానాలు చెప్పారు. దీంతో ఫోర్జరీ ఆరోపణలపై అతనిని అధికారులు అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించడంతో తన ప్రియురాలితో మాల్దీవులకు వెళ్లాలని, ఈ విషయం నా భార్యకు తెలియకుండా ఉండేందుకే ఈ పని చేశానని ఒప్పుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశవుతోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.