భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. భర్తపై కోపంతో ఆత్మహత్య చేసుకోవడమో లేదంటే భర్తపై కోపాన్ని ఇతరులపై చూపించడమో చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళ అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు భర్త మీద కోపాన్ని ఆ మహిళ తన కూతుళ్లపై చూపించింది. చూపించడమే కాకుండా దారుణానికి ఒడిగట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు భర్యాభర్తల మధ్య గొడవంటి? భర్త మీద కోపాన్ని ఆ మహిళ పిల్లల మీద ఎందుకు తీర్చుకోవాలనుకుంది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముల్భాగల్ ప్రాంతం. ఇక్కడే ఉంటున్న ఓ వ్యక్తితో జ్యోతి అనే మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నాళ్ల తర్వాత ఈ భార్యాభర్తలకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఆ దంపతుల కాపురం బాగానే సాగుతూ వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. దీంతో దంపతులు ఇద్దరూ ప్రతీ చిన్న దానికి తిట్టుకోవడం, గొడవలు చేసుకోవడం చేస్తున్నారు. ఇక భర్త ప్రవర్తనతో విసిగిపోయిన జ్యోతి కోపంతో ఊగిపోయింది. ఎలాగైన పగ తీర్చుకోవాలనుకుంది.
ఈ క్రమంలోనే జ్యోతికి ఓ ఆలోచన వచ్చింది. అదే తన పిల్లలను చంపడం. ఇక పథకం ప్రకారం జ్యోతి ఇటీవల భర్తలేని సమయంలో తన ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి ఆ తర్వాత నిప్పింటించింది. కూతుళ్లు కాలిపోతుండడంతో భయంతో ఆమెకు ఏం చేయాలో తెలియక తాను పెట్రోల్ పోసుకుని నిప్పు అంటుంచుకుంది. కాలిపోతున్న వాసర రావడంతో స్థానికులు గమనించి జ్యోతి ఇంటికి పరుగు పరుగున వచ్చారు. కాలిపోతున్న ముగ్గురుని రక్షించి అనంతరం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఓ కూతురు మరణించగా, మరో కూతురు, తల్లి చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.