పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులకు వారికి ఏదైన ఆపద వస్తే తట్టుకోలేరు. బిడ్డలే ప్రాణంగా జీవించే ఓ తల్లికి తీరని శోకం మిగిలింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక పోవడంతో ఆ తల్లి నిస్సాహాయురాలిగా ఉండిపోయింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులకు వారికి ఏదైన ఆపద వస్తే తట్టుకోలేరు. బిడ్డలే ప్రాణంగా జీవించే ఓ తల్లికి తీరని శోకం మిగిలింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక పోవడంతో ఆ తల్లి నిస్సాహాయురాలిగా ఉండిపోయింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఓ కుటుంబం నివసిస్తోంది. అయితే వారి చిన్నారి ఆరుబయట ఆడుకుంటోంది. ఆ సమయంలో ఓ విష సర్పం ఆ బాలికను కాటేసింది. వారు నివసిస్తున్న ప్రాంతం అంతా సరైన రవాణా మార్గం లేకుండా ఉంది. దీంతో ఆ తల్లి అతి కష్టం మీద ఆ చిన్నారి ఆసుపత్రికి తరలించసాగింది. అయితే అప్పటికే ఆలస్యమవ్వడంతో పరిస్థితి విషమించి చిన్నారి మార్గమధ్యలో ప్రాణాలు వదిలింది. బిడ్డ ప్రాణాలు పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వారు ఉండే చోటుకు రాసాగింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం వారు మళ్లీ అంబులెన్స్ లో బయలుదేరారు. కానీ వీరు ఉండే ప్రాంతం కొండ ప్రాంతం అవ్వడంతో, రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో వారిని మధ్యలోనే దింపేశారు. వారు ఇంటకి చేరుకోవాలంటే ఇంకో పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి రోదిస్తూ బిడ్డ మృతదేహాన్ని చేతులపై మోస్తూ పది కిలోమీటర్లు నడిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన పలువురు ఆ తల్లికి వచ్చిన కష్టం మరెవ్వరికి రాకూడదని సానుభూతి వ్యక్తపరుస్తున్నారు.