మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రి దశదినకర్మ కార్యక్రమానికి డబ్బులు లేక కుమారుడు అతహత్మ చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ హృదయ విధారక ఘటన స్ధానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… శామీర్ పేట పరిధిలోని ముడు చింతపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన నర్సింహ తండ్రి యాదయ్య ఇటీవల మరణించాడు.
అయితే తండ్రి మరణించడంతో యాదయ్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఇక ఆదివారం యాదయ్య దశదిన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. దీంతో డబ్బులు ఖర్చు భారీగా అవుతాయని కొడుకు నర్సింహ ఆలోచనలో పడ్డాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు కూడా ఒక్కసారిగా కొడుకు నర్సింహ ముందు నాట్యం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Adilabad: అడిగిందల్లా తెచ్చి ఇచ్చారు! అయినా.. సంతోషికి సంతోషం దక్కలేదు!దీంతో ఆలోచనలు ఎక్కువై మనస్థాపానికి గురయ్యాడు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే నర్సింహ ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న నర్సింహ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజాగా జరిగిన ఈ హృదయ విధారకఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పదిరోజుల్లో ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు మరణించడంతో గ్రామస్తులు వారి కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.