మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా పిల్లల ఆలోచన శైలీలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. పిల్లల వయసుకు వారి ఆలోచనలకు అస్సలు సంబంధమే లేదన్నట్లుగా ఎదిగిపోతున్నారు. ఇక చిన్న వయసులోనే ప్రేమలో పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమలో పడడం, కాదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే 9 తరగతి విద్యార్థులు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులను కోరడంతో వారు మందలించారు.
దీంతో మనస్థాపం చెందిన ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జీడిమెట్లకు చెందిన ఓ బాలిక, బాలుడు స్థానికంగా ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఒకే స్కూలు కావడం, బాగా పరిచయం ఉండడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అలా కొన్ని రోజుల నుంచి వీరి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరు పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: పీకలదాక తాగొచ్చి ఇంట్లో భార్య నానా రచ్చ.. భరించలేని భర్త ఏం చేశాడంటే?